Posts

కేసీఆర్ కీలుబొమ్మ జగన్ ! - Tolivelugu

Image
https://tolivelugu.com/mlc-ashok-babu-on-jagan/ గుంటూరు: తెలంగాణ ముఖ్యమంత్రి చేతిలో జగన్ కీలుబొమ్మలా మారుతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు ఆరోపించారు. తిరుమల బ్రహ్మోత్సవాల్లో శ్రీవారికి పట్టు వస్త్రాల సమర్పణ కేసీఆర్‌తో కలిసి ఇవ్వటమేంటని ప్రశ్నించారు. టీటీడీని కూడా తెలంగాణకు కట్టబెట్టే చర్యలు జరుగుతున్నాయా ? అన్న సందేహం వ్యక్తం చేశారు. ఇద్దరి మధ్య ఎంత మితృత్వం ఉన్నా ఏపీ హక్కులను పోగొట్టుకోకూడదని సూచించారు. గోదావరి నీటి తరలింపు ఏపీ భూ భాగంలోనే జరగాలన్నారు. వైకుంఠ బ్యారేజీ నిర్మాణం ద్వారా ఇది సాధ్యమని చెప్పారు.  అలా చేయకుండా దుమ్ముగూడం నుంచి నాగార్జునసాగర్‌కు వయా నల్గొండ మీదుగా తీసుకురావడం రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుందని వివరించారు. గోదావరి నీటి విషయంలో ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు. కావేరీ గొడవల తరహాలో భవిష్యత్తులో ఇక్కడా గొడవలు జరిగే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసే కుట్రలు జరుగుతున్నాయని అనుమానం వ్యక్తం చేశారు. కేంద్రం సబ్సిడీకి ఇచ్చే ఎలక్ట్రిక్ బస్సులు కొనకుండా టెండరు పిలవడమేంటని నిలదీశారు. For more information go for this link : https://...

అమరావతికి దారేది !? -seed access road from undavalli to amaravati - Tolivelugu

Image
https://tolivelugu.com/seed-aksis-road/ సీడ్ యాక్సెస్ రోడ్డుకు వైసీపీ గ్రామం ఉండవల్లి దారిస్తుందా? సీడ్ యాక్సెస్ రోడ్డు ఆటంకాలు తొలగుతాయా? సీఎం చొరవతో సీడ్ యాక్సిస్ రోడ్డుకు భూసేకరణ సమస్యలు పరిష్కారమవుతాయా? అంతకుముందు సాధ్యం కాని రోడ్డునిర్మాణం ఉండవల్లి ఏరియాలో ఇప్పుడు జగన్ సర్కార్ లో సాధ్యమవుతుందా? ఈ ప్రశ్నలు చర్చనీయాంశమయ్యాయి. సీడ్ యాక్సిస్ రోడ్డు తొలిదశ దొండపాడు నుంచి ఉండవల్లి కొండవీటివాగు లిఫ్ట్ దగ్గర నీళ్ల ట్యాంక్ వరకు 18.3 కి.మీ. దూరం 252 కోట్ల వ్యయంతో ఎన్. సి.సి. చేపట్టడం జరిగింది. ఇది ప్రస్తుతం దొండపాడు నుంచి కృష్ణాయపాలెం వరకు 14 కి.మీ. అక్కడక్కడ కొంత మినహా పూర్తయింది. రాయపూడిలో 300 మీటర్లు భూసేకరణ సమస్యతో, దొండపాడు దగ్గర లోకల్ రోడ్స్ సమస్యతో 100 మీటర్లు పెండింగులో ఉంది. దొండపాడు నుంచి వెంకటపాలెం మీదుగా కృష్ణాయపాలెం వరకు పూర్తయిన సీడ్ యాక్సిస్ రోడ్డు అక్కడి నుంచి ఉండవల్లి వరకు భూసేకరణ సమస్యతో ఆగింది. దీనికి వైసీపీ ప్రభుత్వం రైతుల్ని ఒప్పిస్తే పరిష్కారం దొరుకుతుంది. ఇక సెకండ్ ఫేస్ సీడ్ యాక్సిస్ రోడ్డు జాతీయ రహదారిపై లింక్ చేసే మార్గం ఇంకా మొదలుకాలేదు. దీనికి భూసేకరణ సమస...

శ్రీముఖి- బహుముఖి - Tolivelugu

Image
https://tolivelugu.com/funny-memes-hulchal-on-sreemukhi/ For more information go for this link : https://tolivelugu.com

ఈఎస్ఐలో భారీ స్కామ్ -esi director devika rani huge scam in esi medicines dealings - Tolivelugu

Image
https://tolivelugu.com/esi-director-devika-rani-huge-scam-in-esi-medicines-dealings/ హైదరాబాద్ : ఈఎస్ఐ మందుల కొనుగోలులో భారీ స్కాం బయటపడింది. ఏక కాలంలో 23 చోట్ల ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఈఎస్‌ఐ డైరెక్టర్‌ దేవికారాణి, జేడీ పద్మ, ఏడీ వసంత, ఫార్మా కంపెనీల ప్రతినిధుల ఇళ్లు, కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు చేసింది. అవసరం లేకపోయినా రూ. 300 కోట్ల విలువైన మందులు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. రూ. 10 వేల మందులకు దేవికారాణి రూ. లక్ష క్లెయిమ్‌ చేసినట్లు ఏసీబీ విచారణలో స్పష్టమవుతోంది. దేవికారాణి బినామీ పేర్లతో మందులు కొనుగోలు చేసింది. అర్హత లేని ఏజెన్సీల నుంచి మందుల కొనుగోలు చేశారు. రూ.10 కోట్ల వరకు అవకతవకలు జరిగినట్లు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ వరంగల్ ప్రాంతాలను కేంద్రంగా చేసుకొని దేవికారాణి డ్రగ్స్‌ అండ్‌ డ్రెస్సింగ్‌ మెటీరియల్‌లో అవకతవకలు జరిగాయి. ఈ ఎస్‌ఐ స్కాంలో దేవికారాణితో పాటు 17మంది ఈఎస్‌ఐ ఉద్యోగులు, ఓ చానెల్‌ రిపోర్టర్‌, నలుగురు ప్రైవేటు వ్యక్తుల పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. దేవికారాణి అండతో ఏడాదిలో ముఠా చెలరేగిపోయారు. ముఠా 26 కొనుగోలు ఉత్తర్వులు రద్దు చేసి కొత్త బినామీ ఆర్డర్లు సృష్టిం...

హోరెత్తుతున్న విక్రమ్‌ లాండర్‌ మేమ్‌లు! - Tolivelugu

Image
https://tolivelugu.com/memes-on-vikram/ ‘విక్రమ్’పై సోషల్ మీడియాలో బోలెడన్నీ కామెంట్లు, మేమ్స్ వస్తున్నాయి. ఏదైనా తేడా కొడితే జనం తమలో వున్న క్రియేటీవిటీని బయటి తీసుకొచ్చి దుమ్ము దులుపుతారు. ప్రెజెంట్ చంద్రయాన్ 2 ఫెయిల్ అవ్వడంపై శాస్ర్తవేత్తల్ని గోడలెక్కించి ఎలా గేలిచేస్తున్నారో మీరే చూడండి.. For more information go for this link : https://tolivelugu.com

దేవులపల్లి అమర్‌‌కు గిట్టేది ఇదీ ! - ap govt new go on devulapalli amar appointment- Tolivelugu

Image
https://tolivelugu.com/devulapalli-amar-g-o-viral/ ‘ఏమి రా బాలరాజు.. నీవల్ల దేశానికి ఏమిరా ఉపయోగం..’ అంటూ అమ్మానాన్నా ఓ తమిళమ్మాయి అనే మూవీలో ఓ డైలాగ్ ఒకటుంది. ఇప్పుడు జగన్ సర్కార్ నియామకాలు కూడా అలా కామెడీగానే వున్నాయంటూ సోషల్ మీడియాలో నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు. సాక్షి కుటుంబానికి చెందిన దేవులపల్లి అమర్ అనే మోస్ట్ సీనియర్ జర్నలిస్టుకు జగన్ ప్రభుత్వం ‘అడ్వయిజర్ ఫర్ నేషనల్ మీడియా అండ్ ఇంటర్ స్టేట్ అఫైర్స్’ అనే పోస్టు ఒకటి క్రియేట్ చేసి  ఢిల్లీ కేంద్రంగా కొలువిచ్చింది. దేవులపల్లి అమర్ రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రులపై విద్వేషపూరిత వ్యాఖ్యలు, రాతలను ప్రస్తావిస్తూ.. ఢిల్లీలో సలహాదారుగా నియమించుకునేందుకు జగన్‌కు ఏపీలో సీనియర్ జర్నలిస్టులే దొరకలేదా అంటూ ఆ మధ్య రచ్చరచ్చ అయిన సంగతి తెలిసిందే. తన సహజ ధోరణిలో జగన్ ఇవేమీ పట్టించుకోకుండా అమర్ నియామకానికి ఉత్తర్వులు ఇవ్వడం, వారు కొలువుదీరడం అన్నీ జరిగిపోయాయి. ఐతే, తాజాగా బయటికొచ్చిన ప్రభుత్వ ఉత్తర్వు ఒకటి తెగ వైరల్ అవుతూ అమర్ నియామకంపై మళ్లీ సెగలూపొగలు రేపుతోంది. ఇందులో దేవులపల్లి అమర్‌కు ప్రభుత్వం చెల్లించే జీతభత్యాలకు సంబంధించిన ప...

ఫ్రెంచోళ్లు ఎవరంటే... - french delegates met ap cm jagan mohan reddy- Tolivelugu

Image
  https://tolivelugu.com/french-delegates-met-ap-cm-jaganmohanreddy/ రాష్ట్రంలో ‘రివర్స్’ పాలన నడుస్తుండటంతో ఆల్రెడీ వచ్చిన కంపెనీలే తిరుగుబాట పడుతున్నాయని ప్రతిపక్షం ఓపక్క గగ్గోలు పెడుతుంటే ప్రాన్స్ నుంచి వచ్చిన ఒక వాణిజ్య ప్రతినిధి బృందం ఏపీలో పెట్టుబడులు పెట్టబోతోందంటూ అందిన వార్త బెజవాడ టెంపరేచర్‌ను చంద్రబాబు తగ్గిస్తానన్నంత చల్లగా వినిపించింది. ఇంతకీ వచ్చిన ఈ ఫ్రాన్స్ బృందం ఎవరూ ఏమిటీ అని ఆరా తీస్తే తీరా బయటపడ్డ ఓ షాకింగ్ న్యూస్ ఏంటంటే… 13 మంది పారిశ్రామికవేత్తల బృందం ఒకటి ఫ్రాన్స్ నుంచి వచ్చి ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ను కలిసిందని, ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఈ బృందం ఆసక్తి చూపించిందని సీఎంవో నుంచి వార్తలు వచ్చాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనిపై ట్వీట్ కూడా చేసుకుంది. అబ్బో.. ఎంత మంచి శుభవార్త.. అని జనం ఉప్పొంగిపోయారు. నెమ్మది నెమ్మదిగా రాష్ట్రం లైన్లో పడుతుందని అందరూ అశాభావంతో వున్నారు. ఇంతలో అసలు నిజం ఒకటి బయటపడింది. తీగ పట్టుకుని డొంక లాగిన పరిశీలకులకు అసలు మేటర్ అర్ధమైంది. ఆ వచ్చింది మరెవరో కాదు, మన ‘భారతీ సిమెంట్’ కొన్న ఫ్రాన్స్ కంపెనీ వాళ్లు..! ఫ్రాన్స్ ప్రతి...